యాప్నగరం

ఏపీలో ఘోరం.. మైనర్ బాలికపై గ్రామ వలంటీర్ అత్యాచారం..!

ఏపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై గ్రామ వలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 3 Jul 2020, 2:38 pm
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరుపల్లెలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై గ్రామ వలంటీర్ నరేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్నానం చేసి ఇంట్లోకి వెళ్తుండగా అటకాయించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జరిగిన రెండు రోజులు తర్వాత బాధిత బాలిక తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu మైనర్ బాలికపై అత్యాచారం


అయితే కేసు లేకుండా చూసేందుకు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే పంచాయితీ విఫలం కావడంతో బాలిక తల్లిదండ్రులు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.