యాప్నగరం

రెచ్చిపోయిన గ్రామ వలంటీర్.. పీఎస్ ముందే సచివాలయ ఉద్యోగిపై దాడి

అమరావతి మండలం యండ్రాయి గ్రామ సచివాలయంలో ఓ గ్రామ వలంటీర్ వీరంగం సృష్టించాడు.

Samayam Telugu 20 Oct 2020, 9:02 pm
గుంటూరు జిల్లా అమరావతి మండలం యండ్రాయి గ్రామ సచివాలయంలో ఓ గ్రామ వలంటీర్ వీరంగం సృష్టించాడు. గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి (పీఎస్) సహా అందరూ చూస్తుండగానే ఏకంగా డిజిటల్ అసిస్టెంట్‌పై దాడికి దిగారు. గ్రామ వలంటీర్‌గా పని చేస్తున్న చిల్కా వినోద్ తన వార్డు పరిధిలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను తీసుకొచ్చి డిజిటల్ అసిస్టెంట్ బాబురావుకు ఇచ్చాడు. అయితే పని ఒత్తిడి కారణంగా తర్వాత దరఖాస్తులు పరిశీలిస్తానని వలంటీర్ వినోద్‌కు చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.
Samayam Telugu దాడి చేస్తున్న వలంటీర్


డిజిటల్ అసిస్టెంట్ బాబురావుపై దుర్భాషలాడుతూ పిడిగుద్దులతో దాడి చేశాడు. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి మాట లెక్క చేయకుండా రెచ్చిపోయాడు. చివరకు పంచాయతీ కార్యదర్శి కలుగజేసుకోవడంతో శాంతించాడు. ఏదైనా ఇబ్బంది ఉంటే తమతో చెప్పాలి గాని, ఇలా దాడికి దిగడమేంటని పీఎస్ ప్రశ్నించారు. ఈ ఘటనపై సచివాలయం సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.