యాప్నగరం

పింఛన్ అడిగినందుకు వృద్ధుడిపై గ్రామ వలంటీర్ దాడి.. గాయాలతో ఆస్పత్రిలో..!

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. పింఛన్ అడిగినందుకు..

Samayam Telugu 18 Oct 2020, 8:43 pm
అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ అడిగినందుకు వృద్ధుడని కూడా చూడకుండా గ్రామ వలంటీర్ దాడి చేశాడు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం గోవిందంపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పింఛన్ ఇప్పించాలంటూ
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందంపల్లి గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్ లోకేశ్వరరెడ్డిని వృద్ధుడైన వెంకటరామిరెడ్డి కోరాడు. అయితే పింఛన్ ఇప్పించేందుకు రూ. 5 వేలు లంచంగా ఇవ్వాలని వలంటీర్ డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే పింఛన్ రాదని చెప్పడంతో చేసేదిలేక 8 నెలల క్రితం ఆయన సోదరుడు రామకృష్ణారెడ్డి ద్వారా రూ.5 వేలు లంచంగా వలంటీర్‌కు వెంకటరామిరెడ్డి ఇచ్చాడు. అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా తనకు పింఛన్ రాకపోవడంతో డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ వలంటీర్ లోకేశ్వరరెడ్డిని వెంకటరామిరెడ్డి అడిగాడు.

దీంతో మద్యం మత్తులో ఉన్న వలంటీర్ వృద్ధుడిపై దాడికి దిగాడు. దీంతో వెంటనే వెంకటరామిరెడ్డి ఆ వాలంటీర్‌పై బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్‌లో‌ కేసు నమోదు చేశాడు. ఈ తర్వాత విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే వలంటీర్‌ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడు వెంకటరామిరెడ్డి చికిత్స తీసుకుంటున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.