యాప్నగరం

అనంతపురం: కరోనా సోకిందంటూ వరుడి అదృశ్యం.. చివర్లో అదిరే ట్విస్ట్

యువకుడికి ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం రాత్రి ముహూర్తానికి పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే వరుడు మాయం.. ఈ విచిత్రమైన ఘటనతో అందరూ షాక్ తిన్నారు.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుని నవ్వుకున్నారు.

Samayam Telugu 8 Aug 2020, 7:49 am
అనంతపురం జిల్లాలో విచిత్రమైన ఘటన జరిగింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు కరోనా సోకిందంటూ అదృశ్యం కావడం కలకలంరేపింది. అసలు ఏం జరిగిందని ఆరా తీసిన బంధువులకు షాక్ తగిలింది. వరుడు మాయం కావడానికి కారణం తెలిసి దిమ్మ తిరిగింది. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలకి చెందిన నరసింహులు, నరసమ్మల పెద్ద కుమారుడు రామ్‌కుమార్‌కి కొత్తచెరువు మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం రాత్రి ముహూర్తానికి పెళ్లి జరగాల్సి ఉంది.
Samayam Telugu వరుడి డ్రామా.. చివర్లో ట్విస్ట్


ఈ పెళ్లి ఇష్టంలేని రామ్‌కుమార్‌ ఇంటి నుంచి శుక్రవారం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. పెళ్లిని తప్పించుకోవడానికి కొత్త ప్లాన్ వేశాడు. తర్వాత తనకు కరోనా వ్యాధి సోకిందని, తనను అనంతపురం నారాయణ కాలేజీలోని క్వారంటైన్‌కు తరలించారని బంధువులు, స్నేహితులకు ఫోన్‌ ద్వారా చెప్పాడు. అయితే కుటుంబసభ్యులు, బంధువులు ఏం జరిగిందని ఆరా తీశారు. అధికారులను వివరణ కోరగా రామ్‌కుమార్‌ అనే వ్యక్తిని తాము ఎక్కడికి తీసుకెళ్లలేదని చెప్పారు. పెళ్లి ఇష్టంలేకనే వరుడు ఈ నాటకం ఆడినట్లు తేలింది. ఈ విచిత్రమైన ఘటనతో అందరూ షాక్ తిన్నారు.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుని నవ్వుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.