యాప్నగరం

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి Vs వైసీపీ ఎమ్మెల్యే.. మళ్లీ వార్, ఘర్షణతో టెన్షన్ వాతావరణం

పాతకక్షలతోనే తమ వర్గీయుడిపై దాడి చేశారని పోలీసులకు సిద్దార్థరెడ్డి వర్గీయుల ఫిర్యాదు చేశారు. ముందస్తు జాగ్రత్తగా ప్రాతకోటలో పోలీసులను భారీగా మోహరించారు.

Samayam Telugu 18 Nov 2020, 9:36 am
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పగిడ్యాల మండలం ప్రాతకోటలో నీళ్ల ట్యాంక్‌లో మూత్ర విసర్జన చేశాడని సిద్దార్థరెడ్డి వర్గీయుడిపై దాడికి తెగబడ్డారు. పాతకక్షలతోనే దాడి చేశారని పోలీసులకు సిద్దార్థరెడ్డి వర్గీయుల ఫిర్యాదు చేశారు. ముందస్తు జాగ్రత్తగా ప్రాతకోటలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే పార్టీ, ఇతర వ్యవహారల్లో ఎమ్మెల్యే ఆర్థర్‌, ఇంఛార్జ్ బైరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయుల మధ్య విబేధాలు బయటపడ్డాయి.
Samayam Telugu బైరెడ్డి-ఆర్థర్


అంతేకాదు వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహించారని టాక్ వినిపించింది. ఆర్థర్ కూడా భారీ కార్యక్రమాలు చేపట్టారు.. పాదయాత్రలు నిర్వహించారు. చివరి రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. పార్టీ కార్యకర్తల్ని, జనాల్ని సమీకరించారు. ఆ కార్యక్రమం నిర్వహించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలంరేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.