గూడూరు - విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు సెప్టెంబర్ 1 నుంచి పట్టాలెక్కనుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గూడూరులో ఆదివారం ఉదయం 9:30 గంటలకు జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. Read Also :సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు.. చిత్తూరు టీడీపీ నేత అరెస్టు..
ప్రారంభోత్సవం రోజున గూడూరులో 9.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3.00 గంటలకు విజయవాడ చేరుకుటుంది. విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు ఈ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు 12743/12744 నంబర్లను కేటాయించారు. ఈ ట్రైన్ గత వారమే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఉప రాష్ట్రపతి పర్యటన రద్దు కారణంగా నిలిచిపోయింది. అరుణ్ జైట్లీ మరణం కారణంగా వెంకయ్య తన పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
Read Also : అతి తక్కువ ధరకు టెండర్లు.. రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం..
సెప్టెంబర్ 2 నుంచి రెగ్యులర్ సర్వీస్గా నడుస్తుంది. గూడూరులో ఉదయం 6.10 గంటలకు బయలుదేరి 10.40 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి విజయవాడలో సాయంత్రం 6.00 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు గూడూరు చేరుతుంది. నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి స్టేషన్లలో ఆగనుంది. మొత్తం 12 బోగీలున్న ఈ ట్రైన్లో 2 ఏసీ, మిగిలిన 10 నాన్ ఏసీ బోగాలు ఏర్పాటు చేశారు.
విజయవాడ - విశాఖ పట్నం మధ్య నడపనున్న ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు ప్రారంభోత్సవ తేదీని రైల్వే అధికారులు ఇంకా ఖరారు చేయలేదు.
ప్రారంభోత్సవం రోజున గూడూరులో 9.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3.00 గంటలకు విజయవాడ చేరుకుటుంది. విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు ఈ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు 12743/12744 నంబర్లను కేటాయించారు. ఈ ట్రైన్ గత వారమే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఉప రాష్ట్రపతి పర్యటన రద్దు కారణంగా నిలిచిపోయింది. అరుణ్ జైట్లీ మరణం కారణంగా వెంకయ్య తన పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
Read Also : అతి తక్కువ ధరకు టెండర్లు.. రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం..
సెప్టెంబర్ 2 నుంచి రెగ్యులర్ సర్వీస్గా నడుస్తుంది. గూడూరులో ఉదయం 6.10 గంటలకు బయలుదేరి 10.40 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి విజయవాడలో సాయంత్రం 6.00 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు గూడూరు చేరుతుంది. నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి స్టేషన్లలో ఆగనుంది. మొత్తం 12 బోగీలున్న ఈ ట్రైన్లో 2 ఏసీ, మిగిలిన 10 నాన్ ఏసీ బోగాలు ఏర్పాటు చేశారు.
విజయవాడ - విశాఖ పట్నం మధ్య నడపనున్న ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు ప్రారంభోత్సవ తేదీని రైల్వే అధికారులు ఇంకా ఖరారు చేయలేదు.