యాప్నగరం

నడిబజారులో రెచ్చిపోయిన హోంగార్డు.. అవమానంతో ఆటోడ్రైవర్ అఘాయిత్యం..

హోంగార్డు రెచ్చిపోయి ఆటో డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పాతగొడవలను మనసులో పెట్టుకుని దౌర్జన్యం. కొట్టుకుంటూ స్టేషన్‌కి తీసుకెళ్లిన హోంగార్డు.

Samayam Telugu 6 Nov 2019, 4:52 pm
స్థానిక పోలీస్ స్టేషన్‌కి చెందిన ఓ హోంగార్డు ఆటో డ్రైవర్‌పై దౌర్జన్యానికి దిగాడు. పాతకక్షతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కొట్టుకుంటూ తీసుకెళ్లడంతో యువకుడు మనస్థాపానికి గురయ్యాడు. తీవ్ర అవమానం జరిగిందన్న బాధతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పురుగమందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ విషాద ఘటన గుంటూరులో జిల్లా మాచర్ల మండలం రాయవరంలో చోటు చేసుకుంది.
Samayam Telugu police


మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రాజేష్‌కి ఆటో డ్రైవర్ శ్రీనుతో పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న విషయమై ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. రెచ్చిపోయిన హోంగార్డు రాజేష్ ఆటోడ్రైవర్ శ్రీనుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. చెప్పులతో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లినట్లు సమాచారం.

Also Read: రాయల వారి మాటకు తూట్లు పొడవొద్దు.. జగన్ సర్కార్‌‌‌కు లేఖ

నడిరోడ్డుపై చెప్పుతో కొడుతూ స్టేషన్‌కు తీసుకెళ్లడంతో శ్రీను మనస్థాపానికి గురయ్యాడు. అవమాన భారంతో కుంగిపోయి ఈ లోకం విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. సకాలంలో కుటుంబ సభ్యులు గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు దాష్టీకానికి పాల్పడడంతోనే శ్రీను ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. సామాన్య ఆటో డ్రైవర్‌పై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.