యాప్నగరం

సీఎం జగన్‌పై పోస్ట్‌.. మహిళా ఏజీఎంపై వేటు

తంలో సీఎం పారాసిట్మాల్‌, బ్లీచింగ్‌తో కరోనాను నివారించవచ్చని చేసిన కామెంట్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో రాగా.. ఏజీఎం పిల్లలు దాన్ని ఆమె వాట్సాప్‌ నంబరు నుంచి ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారట.

Samayam Telugu 5 Jun 2020, 7:34 am
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఒకరిపై వేటు పడింది. సీఎంకు వ్యతిరేకంగా పోస్టు చేశారని ఆరోపణలపై గుంటూరు జిల్లా‌ కోపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు ఏజీఎంపై పాలకవర్గం వేటు వేసింది. గతంలో సీఎం పారాసిట్మాల్‌, బ్లీచింగ్‌తో కరోనాను నివారించవచ్చని చేసిన కామెంట్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో రాగా.. ఏజీఎం పిల్లలు దాన్ని ఆమె వాట్సాప్‌ నంబరు నుంచి ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారట. దీన్ని నేరంగా పరిగణించిన సీఐడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బ్యాంకు పాలకవర్గం ఏజీఎంను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
Samayam Telugu సీఎం జగన్ (File Photo)


సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే,పదే చెబుతున్నారు. జనాల్ని రెచ్చగొట్టే విధంగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు మాత్రం హద్దులు మీరుతున్నారు.. దీంతో సీఐడీతో పాటూ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాపై ప్రత్యేకంగా నిఘా పెట్టామని డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా చెప్పారు. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుగా, అభ్యంతరకరమైన పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.