యాప్నగరం

గుంటూరు: నకిలీ పత్రాలతో ఎస్సై కొలువు.. 2014 నుంచి విధులు.. చివరికి!

Guntur Fake SI: గుంటూరులో నకిలీ సర్టిఫికెట్లతో ఎస్సైగా పని చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 7 Oct 2020, 3:20 pm
నకిలీ ధ్రువపత్రాలతో ఎస్సైగా పని చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో అటాచ్‌మెంట్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న గోగిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై ఏలూరు రేంజి అధికారులు కేసు నమోదు చేశారు. తొలుత అగ్నిమాపక శాఖలో పనిచేసిన ప్రభాకరెడ్డి 2011 ఎస్ఐ రిక్రూట్మెంట్‌లో పాల్గొని అర్హత సాధించారు. అనంతరం తన ధ్రువపత్రాలను ఏలూరు రేంజి ఐజీ కార్యాలయంలో అందజేశారు.
Samayam Telugu ప్రభాకర్ రెడ్డి (ఫైల్ ఫొటో)


అయితే రిక్రూట్‌మెంట్ సమయానికే రెండేళ్లు వయస్సు అధికంగా ఉన్న ప్రభాకర్ రెడ్డి, తాను ఎన్‌సీసీలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేసినట్టు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించాడు. ఎన్‌సీసీ ఇన్‌స్పెక్టర్‌‌కు మూడేళ్ల వయసు సడలింపు అవకాశముంటుంది. ఈ విధంగా ప్రభాకర్ రెడ్డి 2014లో ఎస్ఐగా పోస్టింగ్ సాధించారు.

మొదటి నుంచి వివాదాస్పదుడిగా పేరున్న ప్రభాకర్‌రెడ్డి.. ప్రకాశం జిల్లా కొమరోలులో పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఎంపీడీవోతో గొడవ పెట్టుకున్నారు. దీంతో ఎస్ఐ తీరుపై అనుమానం వచ్చిన ఎంపీడీవో గుంటూరు రేంజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసు ఉన్న తాధికారులు దీనిపై విచారణ చేయాల్సిందిగా మార్కాపురం డీఎస్పీని ఆదేశించారు. ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన విషయం వాస్తవమేనని విచారణలో వెల్లడైనట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.