యాప్నగరం

అక్కడ సెల్ఫీలపై నిషేధం.. పోలీసుల షాకింగ్ నిర్ణయం

సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఏకంగా సెల్ఫీలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 21 Nov 2019, 9:05 pm
సెల్ఫీ మోజులో యువత ప్రాణాల మీదకు తెచ్చకుంటున్న ఘటనలపై స్పందించిన ఏపీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలపై నిషేధం విధించారు. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకునేందుకు వీల్లేదంటూ నిషేధాజ్ఞ‌లు అమల్లోకి తెచ్చారు. ఇకపై ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గతంలో జరిగిన ప్రమాద ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu selfie.


సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలను గుంటూరు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇటీవల ఓ బీటెక్ విద్యార్థిని సెల్ఫీ కోసం వెళ్లి కాల్వలో పడి మరణించిన ఘటన చోటుచేసుకుంది. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కాల్వ గట్లు, చెరువులు, జలాశయాల వద్ద సెల్ఫీలు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Also Read: తిరుమల వివాదం: కమ్మ కులంలో పుడితేనే.. మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

తాజా ఆదేశాలతో జిల్లాలోని కాల్వలు, జలాశయాల వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు యత్నిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అలాగే పులిచింత జలాశయంలో మొసళ్లు ఉన్నాయని.. అక్కడ సెల్ఫీలు తీసుకునేందుకు యత్నిస్తే ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయని.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాపాయంలో చిక్కుకునే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. రిజర్వాయర్లు, కాల్వల వద్ద ఫొటోలు దిగొద్దంటూ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.