యాప్నగరం

విశాఖవాసులు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. జీవీఎంసీ అలర్ట్

విశాఖ ప్రజల్ని జీవీఎంసీ అలర్ట్ చేసింది.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని.. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలో సూచించింది.

Samayam Telugu 8 May 2020, 8:10 am
విశాఖలో గ్యాస్ లీకేజ్‌తో నగరవాసులు వణికిపోతున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ గ్యాస్ లీకైనట్లు ప్రచారంతో స్థానికులు పరుగులు తీశారు. గోపాలపట్నం సమీప గ్రామాల ప్రజలు రోడ్లుపైకి వచ్చారు. తర్వాత పోలీసులు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దనడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫ్యాక్టరీకి రెండు కిలోమీటర్ల దూరంలో నివాసముంటున్న ప్రజలను ముందుజాగ్రత్త చర్యగా ఖాళీ చేయాలని కోరామని.. ఎల్జీ పాలిమర్స్‌కు దూరంగా ఉంటున్నవాళ్లు ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు.
Samayam Telugu విశాఖవాసులకు జీవీఎంసీ అలర్ట్


ఇదిలా ఉంటే నగర ప్రజల్ని జీవీఎంసీ అప్రమత్తం చేసింది. గ్యాస్ లీక్‌ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని సూచించింది. ప్రమాదం జరిగిన ప్రదేశం చుట్టుపక్కల ప్రజలు సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని.. నీటితో తడిపిన గుడ్డ లేదా నీటితో తడిపిన మాస్కు ధరించాలన్నారు. కళ్ళు మంటలు, కళ్ళు దురద ఉంటే మంచి నీటితో కళ్ళను శుభ్రపరుచుకోవాలి. పాలు, అరటిపండు. బెల్లం ఆహారంగా తీసుకుంటే విషవాయువు ప్రభావం నుంచి ఉపశమనం పాందవచ్చంటున్నారు.

అలాగే మూతలు లేని ఆహారం, మూతలేని నీటిని తీసుకోవద్దని జీవీఎంసీ సూచించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉన్నట్లైతే వైద్య సహాయం కోసంసంప్రదించాలన్నారు. అవసరమైతే 108కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. ప్రజలెవరూ భయపడనవసరం లేదని.. వదంతులు నమ్మవద్దంటున్నారు. వదంతులు వ్యాప్తి చేయొద్దని సూచించారు. ఇటు గ్యాస్ లీక్ బాధితుల కోసం ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. ఆ వివరాలను ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.