యాప్నగరం

విశాఖ టు తిరుపతి.. గ్రీన్‌ ఛానల్ ద్వారా గుండె తరలింపు, అరుదైన సర్జరీ

Vizag To Tirupati Heart Shifting చేశారు. విశాఖలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్‌లో 15ఏళ్ల విశ్వేశ్వరయ్య అనే బాలుడికి అమర్చనున్న వైద్యులు.. గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలించారు. విశాఖకు చెందిన జంజూరు సన్యాసమ్మ సంక్రాంతి పండగ రోజు భర్త ఆనందరావుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సన్యాసమ్మ బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో కుటుం సభ్యులు అవయవ దానంకు ముందుకొచ్చారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 20 Jan 2023, 1:15 pm

ప్రధానాంశాలు:

  • విశాఖ టు తిరుపతి గుండె తరలింపు
  • గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులు
  • అరుదైన హార్ట్ ట్రాన్స్‌ ప్లాంటేషన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vizag To Tirupati Heart Shifting With Green Channel
ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల సహకారంతో గ్రీన్ ఛానల్ ద్వారా ఓ మహిళ గుండెను విశాఖపట్నం నుంచి తిరుపతికి తరలించారు. షీలానగర్ కిమ్స్ ఐకాన్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతిలోని శ్రీపద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్‌కు గుండెను తరలించారు. కిమ్స్ నుంచి వైజాగ్ ఎయిర్‌పోర్టు వరకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిటీలో అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించారు.
విశాఖ నగరానికి చెందిన జంజూరు సన్యాసమ్మ (48) సంక్రాంతి పండగ రోజు భర్త ఆనందరావుతో కలిసి బైక్‌పై వెళ్తూ ఎయిర్‌పోర్టు సమీపంలోని ప్రమాదానికి గురైంది. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించడంతో అవయవ దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. దీంతో తిరుపతిలోని శ్రీపద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్‌లో ఓ బాలుడికి గుండె అవసరం ఉందని తెలుసుకుని అందుకనుగుణంగా ఆస్పత్రి వర్గాలు, పోలీసులు ఏర్పాట్లు చేశారు.

ఆ గుండెను పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ హాస్పిటల్‌కు తరలించిన డాక్టర్లు నేడు ఆ చిన్నారికి అమర్చనున్నారు. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన నరసయ్య, రాధమ్మ దంపతులకు కుమారుడైన 15ఏళ్ల విశ్వేశ్వరయ్యకు ఆ గుండెను అమర్చేందుకు సిద్ధమయ్యారు. 2021 అక్టోబర్ 11న సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ఇప్పటి వరకు వెయ్యి మంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించింది. ఈ క్రమంలోనే ఇక్కడి వైద్యులు శుక్రవారం మరో అరుదైన హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్‌‌కు సిద్ధమయ్యారు. మరోవైపు సన్యాసమ్మ తమ ఎదుట లేకపోయినా అవయవదానం రూపంలో ఆమె బ్రతికే ఉంటుందని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.