యాప్నగరం

ఏపీలో దంచికొడుతున్న వానలు.. ఈ జిల్లాలకు హై అలర్ట్

ఈ ప్రభావంతో రాగల 4, 5గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

Samayam Telugu 26 Sep 2020, 10:57 am
బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. జూన్ నుంచి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తరం వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 28 నుంచి వెనుదిరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాగల 4, 5గంటల్లో పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం , తూర్పు గోదావరి జిల్లాలలో ఒంటరి ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.
Samayam Telugu ఏపీలో భారీ వర్షాలు


ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గుంటూరు జిల్లాలో వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. వర్షాల దెబ్బకు పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వినుకొండ, సీతయ్య నగర్‌లో వర్షానికి ఓ పెంకుటిల్లు కూలిపోయింది. రాజుపాలెం మండలం బలిజేపల్లి వద్ద ఎద్దు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డెల్టా ప్రాంతంలో కుండపోత వాన కురిసింది.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. పొలాలు నీట మునిగాయి.

ఇటు ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, కనిగిరి, అద్దంకిలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గిద్దలూరులో కురిసిన భారీ వర్షానికి పట్టణం సమీపం నుంచి ప్రవహించే సగిలేరు వాగుకు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీరు వచ్చి చేరుతోంది. వర్షపు నీటికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.