యాప్నగరం

24 గంటల్లో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు

రాయలసీమలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొంది. రెండు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Samayam Telugu 25 Jun 2020, 7:28 am
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 24 గంటల్లో మాత్రం ఉత్తర తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో 26న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిన తరువాతే, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొంది. అలాగే, ఈశాన్య మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో బుధవారం ఏపీలోని ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అయితే, దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తిరుపతిలో 39.6, నెల్లూరు 38.9, అనంతపురం 38.4, గుంటూరు 38.7, విజయవాడ 38.2, ఏలూరు 36.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు ఉత్తర భారత దేశంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెటియరలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) బుధవారం పేర్కొంది. పశ్చిమ హిమాలయ పర్వత ప్రాంతాలు, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లలో రాబోయే 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రెండు రోజుల తర్వాత వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.