టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమైంది జగన్ సర్కార్. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేశారని.. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా.. ఖర్చులపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం తీసుకున్నారు. తమ సంస్థపై ఆరోపణలు రావడంతో హెరిటేజ్ స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసిన ఉత్పత్తులపై హెరిటేజ్ సంస్థ వివరణ ఇచ్చింది. రూ.40కోట్ల విలువైన మజ్జిగ ప్రభుత్వానికి హెరిటేజ్ సరఫరా చేయలేదని చెబుతోంది.
హెరిటేజ్ సంస్థ గత ప్రభుత్వ హాయాంలో 2015-16 నుంచి 2019-20 వరకు సరఫరా అయ్యే మజ్జిగ విలువ రూ.1.49 కోట్లు మాత్రమే అంటోంది. 2014-15 నుంచి 2016-17 వరకు నెయ్యి సరఫరా మొత్తం విలువ రూ 21.19 కోట్లు అని చెబుతోంది. ముఖ్యమైన పండుగలకు టెండర్ల ప్రక్రియలో పాల్గొని ఆర్డర్లు పొందామంటున్నారు. ఇతర కంపెనీలు, బ్రాండ్ లతో కలిసి ఒకే ధరకు ఆర్దర్లు పంచుకున్నట్టు తెలిపింది. ఏ ఒక్క ఫుడ్ ప్రొడక్ట్ కూడా మొత్తం ఆర్డర్ హెరిటేజ్ సంస్థకు ఇవ్వలేదంటోంది.
ప్రతి ఏడాది అవసరమైన పరిమాణం భాగస్వామ్య సంస్థల ద్వారా పంపిణీ చేశామని.. ప్రతి ప్రక్రియ పారదర్శకంగా ఉందని హెరిటేజ్ చెబుతోంది. ఉత్పత్తిని మార్కెటింగ్ చేసినందుకు సంస్థపై ఆధారపడిన రైతులకు ఉపయోగపడిందని.. హెరిటేజ్ సంస్థపై నిందలు మోపే ముందు లక్షల మంది, రైతుల జీవనాధారాన్ని కలవర పెడుతున్నారని గ్రహించాలంటోంది.
జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలపై కేబినెట్ సబ్కమిటీ సీఎం జగన్కు నివేదిక అందజేయగా.. కేబినెట్లో చర్చించారు. చంద్రన్న తోఫా, చంద్రన్న కానుక వంటి పథకాల ద్వారా రూ.158కోట్ల అవినీతి జరిగిందని కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40కోట్లు ఖర్చు చేశారని.. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా.. ఖర్చులపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై ఏపీ ప్రభుత్వం గతంలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. అంశాలవారీగా గత ప్రభుత్వ నిర్ణయాలను పరిశీలించి నివేదికల్ని ప్రభుత్వానికి అందజేస్తోంది.
హెరిటేజ్ సంస్థ గత ప్రభుత్వ హాయాంలో 2015-16 నుంచి 2019-20 వరకు సరఫరా అయ్యే మజ్జిగ విలువ రూ.1.49 కోట్లు మాత్రమే అంటోంది. 2014-15 నుంచి 2016-17 వరకు నెయ్యి సరఫరా మొత్తం విలువ రూ 21.19 కోట్లు అని చెబుతోంది. ముఖ్యమైన పండుగలకు టెండర్ల ప్రక్రియలో పాల్గొని ఆర్డర్లు పొందామంటున్నారు. ఇతర కంపెనీలు, బ్రాండ్ లతో కలిసి ఒకే ధరకు ఆర్దర్లు పంచుకున్నట్టు తెలిపింది. ఏ ఒక్క ఫుడ్ ప్రొడక్ట్ కూడా మొత్తం ఆర్డర్ హెరిటేజ్ సంస్థకు ఇవ్వలేదంటోంది.
ప్రతి ఏడాది అవసరమైన పరిమాణం భాగస్వామ్య సంస్థల ద్వారా పంపిణీ చేశామని.. ప్రతి ప్రక్రియ పారదర్శకంగా ఉందని హెరిటేజ్ చెబుతోంది. ఉత్పత్తిని మార్కెటింగ్ చేసినందుకు సంస్థపై ఆధారపడిన రైతులకు ఉపయోగపడిందని.. హెరిటేజ్ సంస్థపై నిందలు మోపే ముందు లక్షల మంది, రైతుల జీవనాధారాన్ని కలవర పెడుతున్నారని గ్రహించాలంటోంది.
జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలపై కేబినెట్ సబ్కమిటీ సీఎం జగన్కు నివేదిక అందజేయగా.. కేబినెట్లో చర్చించారు. చంద్రన్న తోఫా, చంద్రన్న కానుక వంటి పథకాల ద్వారా రూ.158కోట్ల అవినీతి జరిగిందని కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40కోట్లు ఖర్చు చేశారని.. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా.. ఖర్చులపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై ఏపీ ప్రభుత్వం గతంలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. అంశాలవారీగా గత ప్రభుత్వ నిర్ణయాలను పరిశీలించి నివేదికల్ని ప్రభుత్వానికి అందజేస్తోంది.