యాప్నగరం

సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిని కలిసిన నమ్రత శిరోద్కర్

YS Bharathi| తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతిని కలిసిన నమ్రత శిరోద్కర్. మహేష్‌బాబు దత్తత గ్రామమైన బుర్రిపాలెంలో అభివృద్ది పనులపై చర్చ.

Samayam Telugu 25 Oct 2019, 3:33 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిని హీరో మహేష్‌బాబు సతీమణి నమత్ర శిరోద్కర్ కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన నమ్రత.. భారతితో భేటీ అయ్యారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు.. ఆ గ్రామ అభివృద్ది పనుల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే గ్రామంలో చేస్తున్న పనుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం.
Samayam Telugu namratha.


ఈ సందర్భంగా మహేష్‌బాబు చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాలను వైఎస్ భారతి ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, మహేష్ బాబులు సౌజన్యంతో బుర్రిపాలెంలో చేపట్టబోయే పనుల గురించి నమత్ర, భారతి చర్చించినట్లు సమాచారం. మరోవైపు వైఎస్ భారతిని కలిసే ముందు నమత్ర విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.