యాప్నగరం

ఏపీలో వర్షాల బీభత్సం.. ఈ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. తీవ్ర హెచ్చరికలు

ఏపీలో నాలుగు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలకు తీవ్ర హెచ్చరికలు..!

Samayam Telugu 29 Nov 2021, 3:25 pm
వరుసగా కురుస్తున్న వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాజయసీమ ప్రాంతాల్లో వానలు జోరుగా కురుస్తున్నాయి. అప్పపీడనం ప్రభావంతో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ చేసింది. ఈ నాలుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఈ నెల 30వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. తొలుత ఇది 29వ తేదీనే ఏర్పడుతుందని అంచనా వేశారు. కానీ, అల్పపీడనం ప్రస్తుతం బ్యాంకాక్‌ సమీపంలో ఉండడంతో అండమాన్‌ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక, తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

అలాగే, ఈ సీజన్‌లో అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. తాజాగా మళ్లీ వానలు పడుతుండటంతో వరదముప్పు ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో చెక్‌డ్యాంల నుంచి వరద ముప్పు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆక, తమిళనాడు రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. భారీవర్షాల కారణంగా సోమ, మంగళవారాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తమిళనాడు తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకు 40 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్ల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.