రాజధాని అమరావతి కోసం జరిపిన భూసేకరణలో అసైన్డ్ భూములిచ్చిన రైతులకు.. రిటర్న్ గిఫ్ట్ ప్లాట్ను గత టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఈ ప్లాట్లను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ జీవోను రైతులు హైకోర్టులో సవాల్ చేయగా.. వారికి ఊరట లభించింది. రైతుల పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రభుత్వం ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఈ జీవోకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవద్దని అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ)ని ఆదేశించింది. రైతులకు రిటర్న్ గిప్ట్గా ఇచ్చిన ప్లాట్లను స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని వారి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారమే ప్లాట్లను ఇచ్చారని, దానిని ఖచ్చితంగా అమలు చేయాలని ధర్మాసనానికి వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
రాజధాని నిర్మాణంలో భాగంగా జరిగిన భూసమీకరణలో అసైన్డ్ భూములను కోల్పోయిన రైతులకు గత టీడీపీ ప్రభుత్వం రిటర్న్ ప్లాట్లను ఇచ్చింది. ఇందుకోసం జీవో నంబర్ 41ను విడుదల చేసింది. భూములను కోల్పోయిన అసైన్డ్ రైతులు అవసరాల కోసం ఆ ప్లాట్లను విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం నిబంధనలకు విరుద్దంగా అసైన్డ్ భూము లావాదేవీలు జరిగాయంటూ రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు జీవో 316ను విడుదల చేసింది.
రాజధాని నిర్మాణంలో భాగంగా జరిగిన భూసమీకరణలో అసైన్డ్ భూములను కోల్పోయిన రైతులకు గత టీడీపీ ప్రభుత్వం రిటర్న్ ప్లాట్లను ఇచ్చింది. ఇందుకోసం జీవో నంబర్ 41ను విడుదల చేసింది. భూములను కోల్పోయిన అసైన్డ్ రైతులు అవసరాల కోసం ఆ ప్లాట్లను విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం నిబంధనలకు విరుద్దంగా అసైన్డ్ భూము లావాదేవీలు జరిగాయంటూ రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు జీవో 316ను విడుదల చేసింది.