యాప్నగరం

ఏపీపై భానుడి ప్రతాపం.. మరో మూడ్రోజులు జాగ్రత్తలు తప్పవు

కొన్ని జిల్లాల్లో భానుడు పంజా విసురుతాడని.. నిప్పుల వానలా ఎండ కాస్తుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. మరికొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అంటున్నారు.

Samayam Telugu 26 May 2020, 7:39 am
రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులపాటు వేడిగాలులు, ఉక్కపోత తప్పదంటోంది విశాఖ వాతావరణ కేంద్రం. కొన్ని జిల్లాల్లో భానుడు పంజా విసురుతాడని.. నిప్పుల వానలా ఎండ కాస్తుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. మరికొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అంటున్నారు. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని.. ప్రజలు ఇళ్లల్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Samayam Telugu మరో మూడ్రోజులు ఎండలే


ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలు (లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు) తాగాలి అంటున్నారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి అంటున్నారు.

ఎండలతో పాటూ వేడి గాలులు, తీవ్ర ఉక్కపోత తప్పదంటున్నారు వాతావరణశాఖ అధికారులు. డీహ్హైడ్రేషన్‌కు గురై శరీరంలో నీటి శాతం తగ్గుతుందని ఎక్కువుగా నీరు తాగడం, ఉప్పు కలిపిన మజ్జిగ, లస్సీ, ఓఆర్‌ఎస్ తాగితే మంచిందంటున్నారు. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దంటున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.