తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి చెందిన రథం మంటల్లో కాలిపోయిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు మంత్రులు వెల్లంపల్లి, విశ్వరూప్లు వచ్చారు. అదే సమయంలో వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడ ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రుల వాహనాలను వారు అడ్డుకున్నారు.. ముందకు వెళ్లకుండా ఆపారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కు తగ్గకుండా మంత్రులపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత మంత్రులు భజరంగ్, వీహెచ్పీ నేతలతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంతర్వేదిలో ప్రఖ్యాత శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి చెందిన రథం శనివారం అర్ధరాత్రి దాటక కాలిబూడిదైంది. లక్ష్మీనరసింహస్వామివారి తీర్థ మహోత్సవం రోజున ఏటా రథోత్సవం జరుగుతుంటుంది. అప్పట్లోనే రూ.94 లక్షల ఖర్చుతో పూర్తి టేకు కలపతో కనులు మిరుమిట్టు గొలిపే రీతిలో తయారైన ఈ రథాన్ని 57 ఏళ్ల నుంచి ఉత్సవాలకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆలయానికి సమీపంలోని ప్రత్యేక షెడ్డులో దీనిని భద్రపరిచారు. శనివారం రాత్రి గమనించిన భక్తులు కేకలు వేయడంతో స్థానికులు, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కు తగ్గకుండా మంత్రులపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత మంత్రులు భజరంగ్, వీహెచ్పీ నేతలతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంతర్వేదిలో ప్రఖ్యాత శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి చెందిన రథం శనివారం అర్ధరాత్రి దాటక కాలిబూడిదైంది. లక్ష్మీనరసింహస్వామివారి తీర్థ మహోత్సవం రోజున ఏటా రథోత్సవం జరుగుతుంటుంది. అప్పట్లోనే రూ.94 లక్షల ఖర్చుతో పూర్తి టేకు కలపతో కనులు మిరుమిట్టు గొలిపే రీతిలో తయారైన ఈ రథాన్ని 57 ఏళ్ల నుంచి ఉత్సవాలకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆలయానికి సమీపంలోని ప్రత్యేక షెడ్డులో దీనిని భద్రపరిచారు. శనివారం రాత్రి గమనించిన భక్తులు కేకలు వేయడంతో స్థానికులు, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.