యాప్నగరం

అనంతపురం: గుత్తి క్వారంటైన్ దగ్గర ఉద్రిక్తత.. పోలీసులపై దాడి

14 రోజుల పాటు క్వారెంటైన్‌ను పూర్తి చేసుకున్న తమను తమ స్వస్థలాలకు పంపించాలని వలస కూలీలు పోలీసులతో గొడవకు దిగారు.. దీంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

Samayam Telugu 14 Apr 2020, 9:54 am
అనంతపురం జిల్లా గుత్తి క్వారంటైన్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. సెంటర్‌లో ఉన్న వలస కూలీలు పోలీసులుపై తిరగబడ్డారు.. దాడి చేశారు. గుత్తి ఎస్కేడి ఇంజనీరింగ్ కాలేజీలో అధికారులు క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ రాష్ట్రాలకు (మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌) సంబంధించిన వలసకూలీలను ఉంచారు. అయితే 14 రోజుల పాటు క్వారెంటైన్‌ను పూర్తి చేసుకున్న తమను తమ స్వస్థలాలకు పంపించాలని వారంతా పోలీసులతో గొడవకు దిగారు.. దీంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
Samayam Telugu atp


వలస కూలీలు తమను ఇళ్లకు పంపే వరకు భోజనం కూడా చేయమని క్వారంటైన్ సెంటర్ దగ్గర ఆందోళనకు దిగారు. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు పంపించడానికి వీలు లేదని పోలీసులువారికి సర్థిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ కూలీలు వినకుండా పోలీసులపై చెప్పులతో, మట్టిగడ్డలతో, బండరాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో గుత్తి సీఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉండటంతో.. వలస కూలీలు చెప్పినా వినకపోవడంతో.. పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.