యాప్నగరం

Pawan Kalyanకు షాకిచ్చిన వైసీపీ కార్యకర్తలు.. తీవ్ర ఉద్రిక్తత

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న పొయ్య గ్రామానికి పవన్ వెళ్లారు. అక్కడ పవన్‌‌ను రాకుండా అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి.

Samayam Telugu 4 Dec 2020, 11:19 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు షాకిచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రైతులను పరామర్శించేందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న పొయ్య గ్రామానికి పవన్ వెళ్లారు. అక్కడ పవన్‌‌ను రాకుండా అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా భారీగా అక్కడే మోహరించారు. పంటలను పరిశీలించి అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
Samayam Telugu పవన్ పర్యటనలో ఉద్రిక్తత


చిత్తూరు జిల్లా పర్యటను ముగించుకుని పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట చేరుకుంటారు. అక్కడ రైతులను కలిసి పంట నష్టం వివరాలను తెలుసుకుంటారు. 12 గంటలకు గూడూరు చేరుకుంటారు.. అక్కడి రైతులతో మాట్లాడిన అనంతరం మనుబోలు, వెంకటాచలం మీదుగా నెల్లూరు చేరుకుంటారు. శనివారం రాపూరు, వెంకటగిరిలలో పర్యటనలు సాగనున్నాయి. నివర్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.