యాప్నగరం

పవన్ కళ్యాణ్‌ గో బ్యాక్.. కర్నూలులో ఉద్రిక్తత

పవన్ కళ్యాణ్‌కు కర్నూలు నగరంలో నిరసన సెగ తగిలింది. హత్యాచారానికి గురైన సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ పవన్ కర్నూలులో ర్యాలీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 12 Feb 2020, 4:26 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతో కర్నూలు నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2017లో అత్యాచారానికి గురై అనుమానాస్పద రీతిలో మరణించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ బుధవారం (ఫిబ్రవరి 12) ర్యాలీ చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమైన విషయం తెలిసిందే.
Samayam Telugu pawan.


Also Read: జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి.. హోరెత్తుతున్న ట్విట్టర్‌

ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం పవన్ కర్నూలు చేరుకున్నారు. అయితే పవన్ పర్యటనను అడ్డుకునేందుకు రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతల ప్రయత్నించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు.

గో బ్యాక్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. రాయలసీమకు పవన్ అన్యాయం చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో కర్నూలు కలక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ర్యాలీగా వెళ్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితులు కొద్దిగా చక్కబడ్డాయి.

Also Read: సీఎం జగన్‌ను ఇరుకున పెట్టే అంశం ఎత్తుకున్న జనసేనాని.. వైసీపీకి ఇబ్బందులు తప్పవా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.