యాప్నగరం

ఏపీలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల్లో ప్రజలు జాగ్రత్త, వాతావరణశాఖ హెచ్చరిక

Ap High Temperatures ఇవేం ఎండలు బాబోయ్.. మాడు పగలగొడుతున్నాయి. నాలుగు రోజులుగా అల్లాడిపోతున్న జనాలు.. రికార్డుల క్రియేట్ చేస్తున్న ఉష్ణోగ్రతలు. మరికొద్దిరోజులు ఎండలు తప్పవంటున్న వాతావరణశాఖ. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. మంగళవారం ఏకంగా టెంపరేచర్ 47 డిగ్రీల వరకు టచ్ అయ్యింది.. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. అయితే చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వాతావరణశాఖ.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 17 May 2023, 1:13 pm

ప్రధానాంశాలు:

  • ఏపీలో ఎండలు మండిపోతున్నాయి
  • ఇంట్లో నుంచి వెళ్లాలంటేనే భయం
  • రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu AP Heat Waves
Ap Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు వేడిగాలులు, ఉక్కపోత తోడయ్యాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు.. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే జనాలు వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మొదలవుతున్నాయని.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నాయి.
బుధవారం 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. మంగళవారం 40 మండలాల్లో తీవ్ర వడగాల్పులు , 148 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఇవాళ ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C - 45°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు,కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇంట్లో ఉన్నా ఉక్కపోత.. బయటకు రావాలంటే ఎండల దెబ్బకు భయపడాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందిపడుతున్నారు. వడదెబ్బతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం మినహా మిగిలిన కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైకి చేరాయి. నేడు కూడా రాష్ట్రంలో గరిష్ఠంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకుపైనే కొనసాగాయి. ఎండల దెబ్బకు పిట్టలు కూడా నెలరాలుతున్నాయి.
ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బయటకు వచ్చే సమయంలో కొన్ని సూచనలు పాటించాలంటున్నారు. ప్రయాణాల్లో ఉన్నవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేని పక్షంలో ఇబ్బందిపడతారంటున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఈ ఎండల దెబ్బకు అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాదు ట్రాన్స్‌ఫార్మర్లలో కూడా మంటలు చెలరేగుతున్నాయి. వడదెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు.. కొబ్బరి బోండాలు, శీతల పానియాలకు డిమాండ్ పెరిగింది. ఏపీ మాత్రమే కాదు తెలంగాణలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఎండలు జనాల్ని ఠారెత్తిస్తున్నాయి.


రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.