యాప్నగరం

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సీన్.. వెరైటీ డైలాగ్‌తో నవ్వించిన బాలయ్య

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి బాలయ్య వచ్చిన సమయంలో అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. బాలయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు నడుచుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో పక్కనే ఓ కుక్క మొరిగింది.

Samayam Telugu 19 Jun 2020, 11:55 am
ఏపీ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్‌లో పోలింగ్ నిర్వహిస్తుండగా.. ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీడీపీ నుంచి నందమూరి బాలయ్య తొలి ఓటు వేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి బాలయ్య వచ్చిన సమయంలో అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం జరిగింది.
Samayam Telugu బాలయ్య


బాలయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు నడుచుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో పక్కనే ఓ కుక్క మొరిగింది.. వెంటనే ఆయన వ్యంగ్యంగా స్పందించారు. కుక్క అరుస్తోంది ఎందుకో.. ఎవరికి ఎలా అర్ధమవుతుందో వారికి అదే భాషలో చెప్పాలన్నారు.. తాము అరిచేవాళ్లం కాదు కరిచేవాళ్లం అంటూ డైలాగ్ చెప్పారు. దీంతో పక్కనే ఉన్నవారు పెద్దగా నవ్వారు.. ఈ సీన్ ఆసక్తికరంగా మారింది.

ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 6గంటలకు రిటర్నింగ్‌ అధికారి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి బరిలో ఉన్నారు.. టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీకి దిగారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఏజెంట్‌లుగా ఉన్నారు. అభ్యర్థి వర్ల రామయ్యకు ఏజెంట్‌గా ఎమ్మెల్సీ అశోక్‍బాబును.. పార్టీ తరపున ఏజెంట్‍గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉండనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.