యాప్నగరం

వైసీపీ ఎంపీకి అరుదైన అవకాశం.. త్వరలో ఇటలీకి

పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్‌ గ్రూప్‌ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ నవశకానికి నాంది పలికారు. పార్లమెంటు సభ్యులను వివిధ దేశాల మైత్రి, పరిశీలన, అధ్యయనం కోసం కేటాయించారు.

Samayam Telugu 16 Oct 2020, 7:18 am
వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఇటలీ పార్లమెంటు పరిశీలన, అధ్యయనం చేసే అవకాశం వచ్చింది. పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్‌ గ్రూప్‌ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ నవశకానికి నాంది పలికారు. పార్లమెంటు సభ్యులను వివిధ దేశాల మైత్రి, పరిశీలన, అధ్యయనం కోసం కేటాయించారు. అందులో భాగంగా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఇటలీకి కేటాయించారు. ఆ దేశంలో పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించారు. త్వరలోనే ఆయన ఇటలీ వెళ్లనున్నారు.. ఈ సందర్భంగా ఎంపీకి పలువురు అభినందనలు తెలిపారు.
Samayam Telugu వైసీపీ ఎంపీకి అరుదైన అవకాశం


గోరంట్ల మాధవ్ పోలీస్ శాఖలో సీఐగా పనిచేశారు. అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న క్రమంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డితో వివాదంతో హైలైట్ అయ్యారు. ఆ తర్వాత సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఆ వెంటనే పార్టీ అధినేత వైఎస్ జగన్ హిందూపురం నుంచి ఎంపీ టికెట్ కేటాయించారు. నామినేషన్ విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగగా.. ఆఖరి రోజు ఓకే చెప్పారు. 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీగా భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.