యాప్నగరం

తేనెటీగల దాడి.. మంత్రి అనిల్‌కు తప్పిన ముప్పు, ముగ్గురు ఎమ్మెల్యేలకు గాయాలు

విరుచుకుపడిన తేనెటీగలు.. పరుగులు తీసిన ఎమ్మెల్యేలు, గన్‌మెన్లు వైసీపీ కార్యకర్తలు. కారులో కూర్చోవడంతో సురక్షితంగా బయటపడిన మంత్రి అనిల్‌కుమార్ యాదవ్. కర్నూలు జిల్లాలో ఘటన.

Samayam Telugu 29 Nov 2019, 1:52 pm
ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి.. తేనెటీగల దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్.. పాములపాడు మండలం బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి వెళ్లారు. అనిల్ హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలిస్తున్న సమయంలో తేనెటీగలు ఉన్నట్టుండి దాడి చేశాయి.
Samayam Telugu knl


తేనెటీగల్ని చూసిన మంత్రి, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పరుగులు తీశారు. వెంటనే మంత్రి అప్రమత్తమై కారులోనే ఉండిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు ఎమ్మెల్యేలు, మంత్రి గన్‌మెన్లతో పాటూ మొత్తం 20మందికిపైగా గాయాలు అయ్యాయి. బాధితుల్ని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.