యాప్నగరం

హౌసింగ్ కాంప్లెక్స్‌ రిబ్బన్ కట్ చేసిన రోజా.. భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

విజయవాడలో ఏపీఐఐసీ హౌసింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన రోజా. ప్రోటోకాల్ పాటించలేదని తెలుగు తమ్ముళ్ల అభ్యంతరం.. ప్రభుత్వం, ఏపీఐఐసీ ఛైర్మన్ తీరుపై ఫైర్. ఎంపీ, ఎమ్మెల్యేను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్న.

Samayam Telugu 20 Sep 2019, 10:53 pm
విజయవాడ ఏపీఐఐసీ కాలనీలో హౌసింగ్ కాంప్లెక్స్‌ను ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం రోజా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. హౌసింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు ఆహ్వానం పంపకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఇద్దర్ని పిలవకపోవడం దారుణమన్నారు.
Samayam Telugu Roja


Don't Miss: ఎస్‌' అక్షరం పేరుతో ఉన్న ప్రముఖల వరుస మరణాలు.. జ్యోతిష్యం నిజమవుతోందా!

ది జవహర్ ఆటోనగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కన్స్యూమర్ కో ఆపరేటివ్ స్టోర్స్ కింద ఏపీఐఐసీ కాలనీలో ఆటోనగర్ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ ప్రారంభోత్సవానికి ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాతో పాటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలను ఆహ్వానం పలికారు. కానీ ఎంపీని, ఎమ్మెల్యేను మాత్రం పిలవలేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కనీసం ప్రోటోకాల్ పాటించడం పద్దతని.. ప్రభుత్వం దాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ హయాంలో ఈ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన జరిగినా.. ఏపీఐఐసీ నుంచి నిధులు విడుదలకాక పనులు ఆగిపోయాయి. ఈ విషయాన్ని 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌‌లు వివరించారు. తర్వాత చంద్రబాబు చొరవతో నిధులు విడుదల చేశారట. పనులు కూడా వెంటనే ప్రారంభమై ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి తమవంతుగా కృషి చేసిన నేతలకు ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.