యాప్నగరం

ఏపీ, తెలంగాణ స్నేహితుల విహారయాత్ర విషాదాంతం.. స్పాట్‌లోనే..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన స్నేహితుల విహారయాత్ర విషాందాంతమైంది.

Samayam Telugu 20 Sep 2020, 7:22 pm
Samayam Telugu మారేడుమిల్లి ప్రమాదంలో మరణించిన యువకులు
East Godavari Accident
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన స్నేహితులంతా కలిసి విహార యాత్రకు బయల్దేరగా, మార్గ మధ్యంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

తెలంగాణ, ఏపీలోని విజయవాడకు చెందిన ఐదుగురు యువకులు కారులో తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లికి విహార యాత్రకు బయల్దరారు. ఆదివారం సాయంత్రం మారేడుమిల్లికి సుమారు 5 కి. మీల దూరంలో హెచ్‌ఎన్‌టీసీ వద్దకు రాగానే యువకులు ప్రయాణిస్తున్న కారు అత్యంత వేగంగా వెళ్లి ఒక్కసారిగా చెట్టును ఢీకొంది. దీంతో ఇద్దరు యువకులు తలుపులు బద్దలుకొట్టుకుని బయటపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

కారులోని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను విజయవాడకు చెందిన పులి ప్రవీణ్‌కుమార్‌ (24), పూర్ణసాయి (23)గా గుర్తించారు. గాయపడ్డవారిలో తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన లవంగు భరత్‌ (24), పాల్వంచకు చెందిన నదీర్‌బాషా (23), కొత్తగూడెంకు చెందిన షేక్‌ ఆసిఫ్‌ (24) ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందిస్తున్నారు. మారేడుమిల్లి సీఐ ఏఎస్‌ఎల్‌ రవికుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.