యాప్నగరం

కడప జిల్లా: కారులో నోట్ల కట్టలు.. ఆరా తీసిన పోలీసులు షాక్

కర్ణాటక నుంచి నెల్లూరు వస్తున్న వాహనంలో ఉన్న రూ.1.05 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.

Samayam Telugu 25 Nov 2020, 2:06 pm
కడప జిల్లా బద్వేల్ సమీపంలో భారీగా డబ్బు దొరికింది. గోపవరం మండలం పీ.పీ కుంట చెక్‌పోస్టు దగ్గర బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక నుంచి నెల్లూరు వస్తున్న వాహనంలో ఉన్న రూ.1.05 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళుతున్నారో ఆరా తీశారు.
Samayam Telugu కడప జిల్లాలో భారీగా డబ్బు సీజ్


కర్ణాటక దావణగిరె ప్రాంతానికి చెందిన కారులో తరలిస్తున్న రూ.1.05 కోట్లు నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డబ్బు శివమొగ్గకు చెందిన వక్కల వ్యాపారం చేసే యజమాని నాగేంద్రకు చెందినదిగా గుర్తించారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లొ రావాల్సిన బకాయిలను వసూళ్లు చేసుకుని నెల్లూరులో గ్రానైట్ కోసం అడ్వాన్స్ ఇచ్చేందుకు వెళ్తునట్లు పోలీసుల విచారణలో తేలింది. నగదును తిరుపతి అదాయపు పన్ను అధికారులకు తదుపరి చర్యల నిమిత్తం పంపించామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.