యాప్నగరం

ఏపీ గవర్నర్‌కు కరోనా పాజిటివ్.. ఏఐజీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్!

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Samayam Telugu 17 Nov 2021, 5:47 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి బుధవారం హెల్త్‌ బులెటిన్ విడుదల చేసింది. 88 ఏళ్ల వయసున్న గవర్నర్‌ హరిచందన్ నవంబర్ 17న మధ్యాహ్నం ఒంటి గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు. అయితే గవర్నర్‌కు నవంబర్ 15వ తేదీన కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు.
Samayam Telugu గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్


కాగా, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్ హరిచందన్‌ ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యలు వెల్లడించారు. హరిచందన్‌ ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని, ఎప్పటికప్పుడు హెల్త్‌ బులెటిన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ 2019 జూలై నుంచి ఏపీ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు. 1971లో జన సంఘ్‌లో చేరిన బిశ్వభూషణ్.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004-09 మధ్య ఒడిశా మంత్రిగానూ పని చేశారు. ఆయన రాజకీయ నాయకుడిగానే కాకుండా లాయర్‌గా, రచయితగానూ గుర్తింపు పొందారు.

కాగా, కోవిడ్ బారినపడి హైదరాబాద్ ఎఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిశ్వభూషణ్ హరిచందన్ త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. గవర్నర్ కు మెరుగైన ఆరోగ్యం అందించాలని ఆయన కోరారు. గవర్నర్ ఆయురారోగ్యాలతో తిరిగి వచ్చి రాష్ట్రానికి మెరుగైన సేవలందించాలని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.