యాప్నగరం

YS Jagan న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిందే.. సీబీఐ కోర్టు ఆదేశాలు, ఆయన కూడా..

Vijayasai Reddy, YS Jagan జనవరి 10న కోర్టు ముందు హాజరు కావాలని సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని జగన్ పై కోర్టులో సవాల్ చేయకపోతే.. సీఎం అయ్యాక తొలిసారి ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

Samayam Telugu 3 Jan 2020, 4:56 pm
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు సీఎం జగన్‌కు షాకిచ్చింది. కేసు విచారణ కోసం న్యాయస్థానానికి హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. ఈ నెల 10న కేసు విచారణకు జగన్ హాజరు కావాలని ఆయన తరఫు లాయర్లకు న్యాయస్థానం సూచించింది. జగన్‌తోపాటు.. ఈ కేసులో ఏ-2గా ఉన్న విజయసాయి రెడ్డి కూడా విచారణకు హాజరు కావాలని తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగన్ ఈ కేసులో విచారణకు హాజరు కావడం లేదు.
Samayam Telugu ys jagan


పని ఒత్తిళ్లు, ప్రభుత్వానికి ఆర్థిక భారం దృష్ట్యా తనకు హాజరు నుంచి మినహాయింపు కల్పించాలని సీఎం జగన్ గతంలో సీబీఐ కోర్టును కోరారు. తాను కోర్టుకు హాజరైతే ప్రభుత్వానికి రూ.60 లక్షలు ఖర్చవుతయన్నారు. కానీ న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. నిందితుడు బలమైన వ్యక్తని.. ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ ఆరోపించింది. కాగా.. ప్రతి శుక్రవారం కేసు విచారణకు జగన్ హాజరయ్యే విషయంలో.. ఆయన తరఫు లాయర్లు రకరకాల కారణాలూ చూపిస్తూ పిటిషన్లు వేస్తున్నారు. దీంతో సీఎం అయ్యాక ఇప్పటి వరకూ ఆయన న్యాయస్థానం ఎదుట హాజరు కాలేదు.

ఈ కేసులో దాదాపు 8 ఏళ్లుగా జగన్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసు కారణంగా ఆయన సుమారు 16 నెలలపాటు చర్లపల్లి జైల్లో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు.

Read Also: ‘చిత్తూరు జిల్లాను తమిళనాడు, కర్ణాటకలో కలపాలి’

Read Also: జగన్‌కు నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.