యాప్నగరం

కోడెల శివప్రసాద రావు ‘అనుమానాస్పద మృతి’.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్

కోడెల కుటుంబ సభ్యులు ఆయన ఉరి వేసుకున్నారని చెప్పారు. కోడెల ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. పోస్టుమార్టం కోసం భౌతిక కాయాన్ని ఉస్మానియాకు తరలించాం. వైద్యుల నివేదిక తర్వాతే స్పష్టత వస్తుందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

Samayam Telugu 16 Sep 2019, 4:17 pm
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మూడు బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. కోడెల భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఆయన మృతిపై క్లారిటీ వస్తుందని సీపీ తెలిపారు.
Samayam Telugu pjimage (58)


Must Read : నాన్న ఉరేసుకున్నారు.. ఆయన ఒత్తిడిలో ఉన్నారు: కోడెల కుమార్తె

కోడెల మృతికి సంబంధించి క్లూస్ టీం, టెక్నికల్ టీం దర్యాప్తు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని కోడెల నివాసానికి చేరుకుని క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో పడింది. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. కోడెల కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత కోడెల మృతిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Also Read :కోడెలను వెంటాడి, వేధించి చంపేశారు.. టీడీపీ నేతల ఆగ్రహం

అయితే కోడెల ఉరి వేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఘటన సమయంలో కోడెల భార్య, కూతురు, వ్యక్తిగత సహాయకుడు ఉన్నారని, తక్షణమే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అప్పటికే వైద్యులు మరణించినట్లు నిర్ధారించారన్నారు. ఆయనది హత్యా? ఆత్మహత్యా? అనేది వైద్యుల నివేదిక తర్వాతే నిర్ధారిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.