యాప్నగరం

మమ్మల్ని ముందే హెచ్చరించారు.. శవాసనమే కాపాడింది.. లాంచీ ప్రమాదం నుంచి బయటపడ్డ హైదరాబాదీ

గోదావరిలో పడవ బోల్తాపడిన ఘటన నుంచి బయటపడిన హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. శవాసనం వేయడం వల్ల సురక్షితంగా బయటపడ్డానంటున్న జానకి రామారావు.

Samayam Telugu 15 Sep 2019, 10:58 pm
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో గోదావరిలో లాంచీ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో గల్లంతైన హైదరాబాద్‌కు చెందిన జానకి రామారావు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. శవాసనమే తన ప్రాణాలను నిలబెట్టిందని.. ఘటన జరిగిన సమయంలో తనకు ఎదురైన పరిస్థితి గురించి చెప్పారు.
Samayam Telugu hyderabad.


Read Also: ఆదివారం హడల్: బోటు ప్రమాదాలు ఎక్కువ ఆ రోజే

ఉదయం టిఫిన్ చేసి పాపికొండలు వెళ్లేందుకు తన భార్య, బంధువులతో కలిసి బోటు ఎక్కామన్నారు. ప్రమాదం జరిగే ముందు గోదావరిలో ప్రవాహం ఉందని, ప్రమాదకర ప్రాంతమని లాంచీ సిబ్బంది తమను అలర్ట్ చేసినట్లు చెప్పారు. కానీ ఈలోపే లాంచీ పక్కకు ఒరిగిపోయిందని.. కుర్చీల్లో కూర్చొన్నవాళ్లంతా ఓవైపు వచ్చారని.. బరువు ఎక్కువయ్యిందన్నారు. మొదటి ఫ్లోర్‌లో ఉన్నవాళ్లు పైకి ఎక్కేందుకు ప్రయత్నించారని.. ఈలోపే ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను శవాసనం వేశానని.. తర్వాత స్థానికులు కొందరు తనను కాపాడినట్లు జానకి రామారావు చెబుతున్నారు.

Must Read: గోదావరి విషాదం: లాంచీ ప్రమాదానికి కారణాలు ఇవేనా!

హైదరాబాద్ మేడిపల్లి శ్రీనివాస కాలనీకి చెందిన జానకి రామారావు తన భార్య, బంధువులతో కలిసి రెండు రోజుల క్రితం విహార యాత్రకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా.. భార్య, బంధువులు మాత్రం గల్లంతయ్యారు. జానకి రామారావును ఆస్పత్రికి తరలించి అక్కడి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన తన భార్య, బంధువుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.