యాప్నగరం

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు.. ఆయన 4 నెలల వ్యవధిలో రెండోసారి ట్రాన్స్‌ఫర్

Ap Ias Transfers జరిగాయి. వీరిలో సీనియర్ ఐఏఎస్ కాటమనేని భాస్కర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 4న రవాణాశాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జూన్‌ 28న రాత్రి బదిలీ అయ్యారు. కృష్ణా, గోదావరి కాలువల పారిశుద్ధ్య మిషన్‌కు కమిషనర్‌గా నియమితులు కాగా.. ఇప్పుడు మళ్లీ పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్‌గా బదిలీ చేసింది ప్రభుత్వం.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 13 Aug 2022, 11:11 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ap Ias Transfers
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. సీఎస్ సమీర్‌శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ బదిలీలు తక్షణం అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌గా ఉన్న చదలవాడ నాగరాణి సాంకేతిక విద్య డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్ బాధ్యతల నుంచి పొల భాస్కర్ రిలీవ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎంఎం నాయక్‌ను హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్‌ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు సీఈవోగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆప్కో ఎండీ, ఖాదీ–గ్రామీణ పరిశ్రమల శాఖ సీఈవో బాధ్యతల నుంచి చదలవాడ నాగరాణిని రిలీవ్‌ చేశారు.
బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మికి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్స్‌ కమిషనర్‌గా ఉన్న కాటంనేని భాస్కర్‌.. పాఠశాల విద్యా శాఖ పరిధిలోని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అయితే తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కాటంనేని భాస్కర్‌ మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్స్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

నివాసరావును సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు శ్రీనివాసరావుకు రైతుబజార్ల సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కాటమనేని భాస్కర్‌ని ప్రభుత్వం నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి బదిలీ చేసింది. పాఠశాల విద్యాశాఖలో కొత్తగా.. పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్‌ పోస్టుని సృష్టించి భాస్కర్‌ను దానిలో నియమించింది.
కాటమనేని భాస్కర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 4న రవాణాశాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వా జూన్‌ 28న రాత్రి ప్రభుత్వం బదిలీ చేసింది. కృష్ణా, గోదావరి కాలువల పారిశుద్ధ్య మిషన్‌కు కమిషనర్‌గా నియమించారు. ఇప్పుడు మళ్లీ పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్‌గా బదిలీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాఠశాల విద్యపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్వహణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియిమంచాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.. ఆ పోస్టులో భాస్కర్‌ను నియమించారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.