యాప్నగరం

చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు.. మహిళల దగ్గరకెళ్లి ఈ మాట అన్నావనుకో.. ఎంపీ సంచలనం!

తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Samayam Telugu 22 Aug 2021, 5:47 pm
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిశ యాప్ వల్ల ప్రయోజనం లేదని ట్వీటుతూ రాక్షసానందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళల దగ్గరకెళ్లి ఈ మాట అన్నావంటే చీపుర్లు తిరగేసి చితగ్గొడతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Samayam Telugu నారా లోకేష్


దిశ యాప్‌తో రక్షణ పొందిన వారి పేర్లు పోలీసు విభాగం దగ్గర దొరుకుతాయని.. వాటిని అడిగి తెలుసుకో అంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఆదివారం వరుస ట్వీట్లు చేశారు.


‘‘దిశ యాప్ వల్ల ప్రయోజనం లేదని ట్వీటుతూ రాక్షసానందం పొందితే పొందావు. మహిళల దగ్గరకెళ్లి ఈ మాట అన్నావనుకో చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు మాలోకం. యాప్ తో రక్షణ పొందిన వారి పేర్లు పోలీసు విభాగం దగ్గర దొరుకుతాయి. అడిగి తెలుసుకో.’’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కొన్ని పత్రికలపై సైతం విజయసాయిరెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. గుంటూరు బీటెక్ అమ్మాయి రమ్య హత్య కేసు విషయంలో వస్తున్న కథనాలపై ఆయన మండిపడ్డారు. టీడీపీ అనుకూల మీడియా రాతలు తాలిబన్ల దుర్మార్గాలను తలపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రోజుకో కట్టుకథ అల్లుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏదో జరగబోతున్నట్టు భయం సృష్టించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోందిన విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. తాము రాసింది ఎవరూ నమ్మరని తెలిసినా.. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం విషం చిమ్మే రాతలకు తెగబడుతోందని ఎంపీ ధ్వజమెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.