యాప్నగరం

ఏపీకి మరోసారి వర్ష సూచన.. ఈ జిల్లాలను హెచ్చరించిన వాతావరణశాఖ

Andhra Rains: ఆంధ్రప్రదేశ్‌కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడా వానలు పడ్డాయి. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో కూడా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడతాయని విపత్తుల సంస్థ హెచ్చరించింది. చెట్ల కింద ఉండొద్దని.. జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేసింది. అక్కడక్కడా బలమైన గాలులు వీస్తాయంటున్నారు. ఇటు తెలంగాణలో కూాడా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్‌తో పాటూ పలు జిల్లాల్లో భారీ వాన కురిసింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 Apr 2023, 11:19 am

ప్రధానాంశాలు:

  • ఏపీకి మరోసారి వర్ష సూచన
  • మరో రెండు రోజులు వానలు
  • అలర్ట్ చేసిన వాతావరణశాఖ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Andhra Rains
Ap Weather Today: ఏపీలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ. విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వాడ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి విస్తరించిందని తెలిపారు. ఈ ప్రభావంతో రాయలసీమ, కోస్తాల్లో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి. అలాగే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో ఐదు రోజుల పాటూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు
మరోవైపు రాయలసీమలో ముఖ్యంగా అనంతరం,నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపుల వర్షంతో కూడిన "పిడుగులు" పడే అవకాశం ఉందంటోంది ఏపీ విపత్తుల సంస్థ. ఎక్కడైనా ఎపుడైనా ఉరుములు మెరుపులతో వర్షం ఉన్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని సూచించారు. రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని.. అలాగే అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షంతో కూడిన "పిడుగులు" పడే అవకాశం ఉంది అంటున్నారు. చెట్ల కింద ఉండొద్దని.. దయచేసి అప్రమత్తంగా ఉండాలన్నారు.
బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాతో పాటు యానాంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయంటున్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అంటున్నారు.
దక్షిణ కోస్తాలో కూడా బుధ, గురువారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయంటున్నారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. మంగళవారం కూడా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా వానలు పడ్డాయి.
మరోవైపు తెలంగాణను కూడా వర్షాలు ముంచెత్తాయి. మహారాష్ట్ర మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు కింది స్థాయిలో గాలులు వీస్తున్నాయి. దీంతో బుధ, గురువారాల్లోనూ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. మంగళవారం హైదరాబాద్‌తో పాటూ చట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భాగ్యనగరంలో మంగళవారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రెండు గంటల వ్యవధిలోనే సుమారు 8 సెంటీమీటర్ల వరకు వాన పడింది. వర్షంతోపాటు ఈదురుగాలులు వీచాయి.
అలాగే ఉమ్మడి సంగారెడ్డి, రంగారెడ్డి, రాజన్నసిరిసిల్ల, జనగామ, భద్రాద్రి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల పరిధిలో 4.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షాలు ఈదురుగాలుల దెబ్బకు పంటనష్టం వాటిల్లింది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.