Income Tax Dept Releases Report On Raids On Chandrababu Naidu Ex Ps Srinivas, Tdp Trolls Ysrcp
చంద్రబాబు మాజీ పీఎస్ సోదాలపై ఐటీ రిపోర్ట్.. వైసీపీని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్న టీడీపీ
మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావుపై ఐటీదాడులు జరిగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు విజయవాడలోని ఆయన నివాస గృహంలో సోదాలు, విచారణ జరిగాయి. ఈడీ కూడా ఈ దాడుల్లో పాలుపంచుకుంది. ఈ దాడుల్లో పీఎస్ శ్రీనివాసరావు దగ్గర రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయిని వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారని.. ఈ డైరీలో అనేక కీలకాంశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోటులో ఈ వివరాలు ఉన్నాయనే ప్రచారం ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది.
Samayam Telugu16 Feb 2020, 12:15 pm
మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావుపై ఐటీదాడులు జరిగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు విజయవాడలోని ఆయన నివాస గృహంలో సోదాలు, విచారణ జరిగాయి. ఈడీ కూడా ఈ దాడుల్లో పాలుపంచుకుంది. ఈ దాడుల్లో పీఎస్ శ్రీనివాసరావు దగ్గర రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయిని వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారని.. ఈ డైరీలో అనేక కీలకాంశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోటులో ఈ వివరాలు ఉన్నాయనే ప్రచారం ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది.
దొరికింది రూ.2.63 లక్షలు
కానీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిపిన సోదాల్లో ఈ డబ్బు దొరికిందని ఐటీ విభాగం చెప్పలేదు. పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దొరికాయనే ప్రచారం నిజం కాదని ఐటీ పంచనామా రిపోర్టును బట్టి తెలుస్తోంది. శ్రీనివాస్ ఇంట్లో జరిపిన సోదాల్లో కేవలం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు ఐటీశాఖ తెలిపింది. రూ.2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఐటీ పంచనామా నివేదిక తేల్చింది.
తప్పుడు ప్రచారమని ముందే చెప్పామంటూ..
ఐటీ సోదాల్లో రూ.2 వేల కోట్లు బయటపడ్డాయనే వార్త అబద్ధం అని తేలడంతో.. టీడీపీ శ్రేణులు ప్రతిదాడికి దిగాయి. ఈ విషయమై మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ట్వీట్ చేశారు. ‘‘తప్పుడు ప్రచారం అని ముందే చెప్పాం. ఇదిగో, ఈ రోజు ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా సాక్ష్యం. పచ్చకామెర్ల వాడికి, లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనేది సామెత. అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళకి, అందరూ అవినీతిపరుల్లా కనబడతారు అనేది రుజువైంది’’ అని ట్విట్టర్లో ఆయన విమర్శలు గుప్పించారు.
ట్రోలింగ్ మొదలుపెట్టిన టీడీపీ
ఐటీశాఖ రిపోర్ట్ బయటకు రావడంతో.. టీడీపీ నేతలు, అభిమానులు ఓ రేంజ్లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను ట్యాగ్ చేసి మరీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఫేక్ న్యూస్ బస్టెడ్ అనే హ్యాష్ ట్యాగ్తో వరుస ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.