యాప్నగరం

సీఎం జగన్‌పై అమెరికాలో భారత రాయబారి ప్రశంసలు

YS Jagan Mohan Reddy అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఏపీ సీఎంపై అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ సంకల్పం, విధానాలు ఏపీకి పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.

Samayam Telugu 18 Aug 2019, 12:21 am
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ సంకల్పం, స్థిరత్వం, పారదర్శక విధానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యూహాత్మక మార్గంవైపు నడిపిస్తున్నాయని.. అవి పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు భారత రాయబారి విందు ఇచ్చారు. ఈ విందు కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ అధికారులతో పాటు 60 మందికి పైగా సీనియర్‌ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ సతీమణి భారతి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ నాయకత్వాన్ని భారత రాయబారి హర్షవర్ధన్‌ ప్రశంసించారు.
Samayam Telugu ys jagan
వైఎస్ జగన్


అమెరికాలో భారత అధికారులు గట్టి పునాదులు వేశారని.. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారని సీఎం జగన్‌ ప్రశంసించారు. ఏపీలో వ్యాపారాలకు, పెట్టుబడులకు కొత్త అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఇవి ఏపీ, అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, వ్యాపార, వాణిజ్య, ఇంధన రంగంలో సహకారాన్ని పెంచుతాయని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కావాల్సినంత మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.