యాప్నగరం

TDPలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త.. ఆ ఎంపీ సీటు పక్కాగా ఆయనకే!

చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న నరహరి.. ఈయన రాయలసీమకు చెందిన పారిశ్రామికవేత్త. అలాగే మాజీ ఎంపీకి దగ్గరి బంధువు కూడా.. ఎంపీ సీటు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 2 Jul 2022, 6:49 am

ప్రధానాంశాలు:

  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు
  • బెంగళూరు కేంద్రంగా నరహరికి వ్యాపారాలు
  • ఎంపీ టికెట్ ఖాయమంటూ జోరుగా ప్రచారం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu టీడీపీలో చేరిన నరహరి
టీడీపీ (TDP)లో రాయలసీమ నుంచి మరో చేరిక జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి (Ganta Narahari) చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు పసుపు కండువా కప్ప అధినేత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తాను టీడీపీ కోసం ఒక కార్యకర్త మాదిరిగా పనిచేస్తానని నరహరి అన్నారు. ఈయన బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నారు.. అంతేకాదు 2017-2018లో రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు. తన వ్యాపార కార్యకలాపాల ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు. అంతేకాదు నరహరి దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు సమీప బంధువు. డీకే సతీమణి, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ సోదరికి నరహరి అల్లుడు అవుతారు.
అలాగే తటస్థులను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు అధినేత చంద్రబాబు. రాజకీయాలకు దూరంగా ఉండేవారు, తటస్థులు తెలుగు దేశంలోకి రావాలని ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో సర్వనాశనం అయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్ని వర్గాలు కలిసి రావాలని అన్నారు. ప్రజలు ఇప్పటికే టీడీపీకి మద్దతుగా వస్తున్నారని... ఆయా వర్గాల్లో ఉన్న ప్రముఖులు, విద్యావంతులు కూడా తెలుగు దేశంలోకి రావాలని కోరారు.

నరహరి పార్టీలో చేరడంతో ఆయనకు ఎంపీ సీటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. రాజంపేట లోక్‌సభ స్థానానికి ఆయన టీడీపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో డీకే సత్యప్రభ రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.. ఆవిడ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో రాజంపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంతో నరహరి అయితే బావుంటుందని భావిస్తున్నారట.. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.