యాప్నగరం

నెల్లూరు వచ్చిన హీరోలు రాంచరణ్, శర్వానంద్.. ఆప్తుడు చనిపోవడంతో!

అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈయన డీసీసీబీ మాజీ చైర్మన్‌ వేమిరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి తమ్ముడు. రాజగోపాల్‌రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లాలో నిర్వహించారు.

Samayam Telugu 1 Sep 2020, 7:16 am
హీరోలు రాంచరణ్, శర్వనంద్‌లు నెల్లూరు జిల్లా వచ్చారు. అత్యంత ఆప్తుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈయన డీసీసీబీ మాజీ చైర్మన్‌ వేమిరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి తమ్ముడు. రాజగోపాల్‌రెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి తీసుకువచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.
Samayam Telugu నెల్లూరులో రాంచరణ్


వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పారిశ్రామికవేత్త మాత్రమే కాదు నిర్మాత కూడా అట. రామ్ చరణ్, శర్వానంద్‌లకు ఆప్తుడు. దీంతో ఇద్దరు హీరోలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.. వారితో పాటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి హాజరయ్యారు. రామ్ చరణ్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా తరలివచ్చారు. రాంచరణ్ వారిని నిరుత్సాహపరచకుండా దూరంగా ఓ భవనంపై నిలబడి అభివాదం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.