యాప్నగరం

అమరావతి జేఏసీకి విద్యార్థిని విరాళం.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

గతంలో అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి అనే ఇంటర్ విద్యార్థిని జేఏసీకి ఆశ్చర్యపోయే విరాళం ఇచ్చింది. వైష్ణవి గతంలో రాజధాని నిర్మాణానికి కూడా విరాళం అందజేసింది.

Samayam Telugu 7 Jan 2020, 11:23 pm
అమరావతి పరిరక్షణ జేఏసీకి సంఘీభావం తెలుపుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తన గాజులు విరాళంగా అందజేసిన విషయం తెలిసిందే.. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు రైతులకు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. దీక్షా శిబిరాల వద్దకు విచ్చేసి ఉంగరాలు, నగదు పలు రూపాల్లో విరాళాలు అందిస్తున్నారు.
Samayam Telugu jac.


కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి అనే ఇంటర్ విద్యార్థిని జేఏసీకి ఆశ్చర్యపోయే విరాళం ఇచ్చింది. తన తండ్రి నుంచి సంక్రమించిన భూమిలో ఎకరం భూమిని అమరావతి పరిరక్షణ జేఏసీకి విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఎన్టీఆర్ భవన్ కు తన కుటుంబంతో కలసివచ్చి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి భూమిని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది.

Also Read: ‘కేసీఆర్‌తో జగన్ ఒప్పందం.. అందుకే 3 రాజధానులు’

వైష్ణవి గతంలో రాజధాని నిర్మాణానికి కూడా విరాళం అందజేసింది. 9వ తరగతి చదువుతున్న సమయంలోనే తన పాకెట్ మనీ రూ.లక్ష విరాళంగా ఇచ్చేసింది. అప్పట్లో ఆమెను చంద్రబాబు అమరావతి అంబాసిడర్‌గా ప్రకటించారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వైష్ణవి 2 పాఠశాలల అభివృద్దికి రూ.4 లక్షలు విరాళం అందించడంతో పాటు.. 400 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేసి పలువురి అభినందనలు అందుకుంది.

వైష్ణవి విరాళం స్వీకరించిన చంద్రబాబు మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకోవడం రాష్ట్రంలోని 13 జిల్లాలకు.. 5 కోట్ల ప్రజల బాధ్యత అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దీక్ష సందర్భంగా పలువురు మహిళలు స్పందించి చేతిగాజులు, గొలుసులు, ఉంగరాలు ఇతర ఆభరణాలను విరాళంగా అందించడం రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవిత్రభావానికి నిదర్శనమన్నారు. ఇంటర్ విద్యార్ధిని వైష్ణవి ఏకంగా ఎకరం భూమి విరాళం ఇవ్వడం గొప్ప విషయమని ప్రశంసించారు.

Read Also: ముగిసిన హై పవర్ కమిటీ భేటీ.. ఏపీ రాజధానిపై స్పష్టమైన సంకేతాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.