యాప్నగరం

అచ్చెన్నాయుడితో జగన్‌ మాటామంతి.. బీఏసీ సమావేశంలో ఆసక్తికర సీన్

ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడు, సీఎం జగన్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ. ఇటీవల అచ్చెన్నకు జరిగిన కారు ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నజగన్.

Samayam Telugu 9 Dec 2019, 4:10 pm
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్-టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయడు.. చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందట. కొద్దిరోజుల క్రితం అచ్చెన్న కారుకు విశాఖ దగ్గర ప్రమాదం జరగ్గా.. ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారట.. తనకు స్వల్ప గాయాలయ్యాని.. ఇప్పుడు ఫర్వాలేదని అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారట.
Samayam Telugu achennaidu.


Read Also: సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు.. ఇదేం ట్విస్ట్ గణేశా!

ఈ ఇద్దరు మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో.. చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి స్పందించారట. ‘చూశారా.. మా సీఎంకు మీ మీద ఎంత ప్రేమ ఉందో’అన్నారట. వెంటనే స్పందించిన అచ్చెన్న.. తనకు సీఎం అంటే కోపం లేదని.. ఆయనకు, తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు కదా అన్నారట. ఇద్దరివి వేరు, వేరు పార్టీలు కాబట్టే విభేదం ఉంటుందని వ్యాఖ్యానించారట. దీంతో ముగ్గురు కాసేపు నవ్వుకున్నారట.

ఇదిలా ఉంటే బీఏసీలో అసెంబ్లీ సమావేశాలు వారం పాటూ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిపక్షం టీడీపీ 15 రోజులు సభ నిర్వహించాలని పట్టు పట్టగా.. చర్చించిన తర్వాత ఏడు పని దినాలు సభ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. 9,10,11,12,13,16,17 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శని, ఆది రెండ్రోజులూ అసెంబ్లీకి సెలవు ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.