యాప్నగరం

YSRCP ‘మండలి’ వ్యూహాలకు బాబు కౌంటర్ అటాక్

మూడు రాజధానుల రద్దు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంతో... మండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోంది. కానీ మండలిని రద్దు చేయడం అంత ఈజీ కాదని టీడీపీ చెబుతోంది.

Samayam Telugu 24 Jan 2020, 5:57 pm
మండలి రద్దు దిశగా జగన్ సర్కారు సంకేతాలు పంపుతోన్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మండలిని కేంద్రం రద్దు చేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. మండలిని రద్దు చేసే అధికారం సీఎంకు లేదని అది కేంద్రానికి మాత్రమే ఉందని బాబు తెలిపారు. ఒక వేళ రద్దు చేసినా.. అందుకు ఏడాదిన్నర సమయం పడుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మండలిని రద్దు చేసినా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి మండలిని పునరుద్ధరిస్తామన్నారు.
Samayam Telugu jagan babu


ఇలాంటి మండలి మనకు అవసరమా? అని ప్రశ్నించడం ద్వారా సీఎం జగన్ మండలి రద్దు దిశగా సంకేతాలిచ్చారు. అధికార పార్టీ నేతల తీరు చూస్తే.. గురువారమే మండలి రద్దు నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ సోమవారం అసెంబ్లీ సమావేశమై ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించి.. సస్పెన్స్ క్రియేట్ చేశారు.

మండలి రద్దు చేయడం అనేది జగన్ సర్కారు అసలు వ్యూహం కాదని.. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకోవాలనేదే అధికార పార్టీ ప్లాన్ అనే విశ్లేషణలొచ్చాయి. మండలిని రద్దు చేస్తామనడం ద్వారా ఎమ్మెల్సీలందరూ తమకు అనుకూలంగా మాట్లాడతారని అధికార పార్టీ అంచనా వేస్తోందనేది టీడీపీ శ్రేణుల భావన.

దీనికి విరుగుడుగానే.. ఎమ్మెల్సీల్లో ధైర్యం నింపడం కోసం చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మండలి రద్దు జగన్ అనుకున్నంత ఈజీగా అయ్యే పని కాదని సంకేతాలను పంపుతున్నారు. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని.. ఒక వేళ జగన్ మండలిని రద్దు చేసినా.. భవిష్యత్తులో తాను మళ్లీ అవకాశం ఇస్తాననే భరోసా ఇచ్చేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయి.

Read Also: జగన్‌కు షాకిచ్చిన ఈడీ కోర్టు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.