యాప్నగరం

జగనన్న విద్యా దీవెన వచ్చేసింది: 11 లక్షల మంది అకౌంట్లలో రూ. 693 కోట్లు జమ.. పూర్తి వివరాలివే!

కరోనా లాక్‌డౌన్ కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గడం లేదు. గురువారం జగనన్న విద్యా దీవెన అమలు చేయనున్నారు.

Samayam Telugu 28 Jul 2021, 9:10 pm
కరోనా కష్టకాలంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘సంక్షేమ మంత్రాన్ని’ వదలడం లేదు. ముందుగా చెప్పిన విధంగానే ఠంఛన్‌గా పథకాలు అమలు చేస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల అమలులో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇందులో భాగంగానే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివాలనే లక్ష్యంతో రూపకల్పన చేసిన ‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత నిధులను గురువారం (జూలై 29) సీఎం జగన్ విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


జగనన్న విద్యా దీవెన పథకం రెండో విడతలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు రూ. 693 కోట్లు విడుదల చేయనున్నారు. ఇప్పటికే మొదటి దశ కింద ఏప్రిల్‌ 19న ముఖ్యమంత్రి జగన్‌ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 671 కోట్లు జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరో రూ. 693 కోట్లు విడుదల చేయనున్నారు.

దీంతో, గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టిన బకాయిలు రూ. 1,774 కోట్లతో కలిపి, గురువారం వేయబోయే విద్యా దీవెనతో విద్యార్థులకు మొత్తం రూ. 5,573 కోట్లు జగన్ సర్కార్ వెచ్చించింది. ఇప్పటి వరకు విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్దలు, అమ్మ ఒడి, విద్యాకానుక, మనబడి, నాడు నేడు కింద మొత్తం రూ. 25,714 కోట్లు ఖర్చు చేసింది. మూడో దశ విద్యా దీవెన ఈ డిసెంబర్‌లో, నాలుగో విడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం జమ చేయనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.