యాప్నగరం

లోకేష్ పర్యటనలో జై జగన్ నినాదాలు.. అవాక్కైన తెలుగు తమ్ముళ్లు

నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పెదపూడి మండలం అచుత్యాపురం త్రయం దగ్గర జై జగన్ అంటూ నినాదాలు మొదలయ్యాయి.

Samayam Telugu 20 Oct 2020, 8:06 am
మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని, వరద ప్రబావిత ప్రాంతాలను పరిశీలించారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ,ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగింది. నారా లోకేష్ పర్యటన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పెదపూడి మండలం అచుత్యాపురం త్రయం దగ్గర లోకేష్ గో బ్యాక్, జై జగన్ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తమను రెచ్చగొట్టేందుకే నినాదాలు చేశారని టీడీపీ మండిపడింది. టీడీపీ నేతలెవరూ రాష్ట్రంలో పర్యటించకూడదా అని ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమే లోకేష్ పర్యటన కొనసాగింది. టీడీపీ కేడర్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే న్లల్లమిల్లి రామకృష్ణా రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోకేష్ పర్యటన జరగకుండా అడ్డుపడ.. భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Samayam Telugu నారా లోకేష్


Read Also: టీడీపీకి నటి రేవతి చౌదరి గుడ్‌ బై.. ఆ హామీ ఇచ్చి ఏడాది గడిచినా!

వర్షాలు, వరదలకు రైతులు నష్టపోతే సీఎం జగన్ పట్టించుకోకుండా హెలికాప్టర్‌లో తిరుగుతున్నారని, మంత్రులేమో అన్నదాతలను అవమానిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. మంత్రులంతా లోకేష్‌ను ఎలా హేళన చెయ్యాలి అనే ఎంతసేపూ ఆలోచిస్తున్నారు.. ఆ శ్రద్ధ ఏదో అన్నదాతల కష్టాలు తీర్చడానికి చూపించడం లేదన్నారు. గతంలో వరదలతోనష్టపోయిన రైతులకు ఇంకా పరిహారమే ఇవ్వలేదని.. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు మునిగి నష్టపోతే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

Also Read: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలవారు రెండ్రోజులు జాగ్రత్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.