యాప్నగరం

పోలవరానికి అప్పటి దాకా నిధులివ్వలేం.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి

పోలవరం ప్రాజెక్టు విషయమై మంగళవారం పార్లమెంట్‌లో చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాజ్యసభలో సావధాన తీర్మానం ప్రవేశపెట్టగా.. ఏపీ ఎంపీలు ప్రాజెక్టు విషయమై మాట్లాడారు. అనంతరం మంత్రి నిధుల విషయమై స్పష్టత ఇచ్చారు.

Samayam Telugu 10 Dec 2019, 10:03 pm
పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మంగళవారం పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ ఖర్చుకు సంబంధించిన ఆడిట్‌ డాక్యుమెంట్లు కేంద్రానికి పూర్తిగా అందలేదన్న ఆయన.. అవి తమకు అందే వరకూ తదుపరి నిధులు విడుదల చేయడం కుదరదన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయగా.. ఆడిట్‌ పత్రాల్లో కేవలం రూ.3 వేల కోట్లకు సంబంధించిన పత్రాలే కేంద్రానికి అందాయన్నారు.
Samayam Telugu polavaram


పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కేంద్రాన్ని కోరగా.. మంత్రి పై విధంగా స్పందించారు. కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో మంగళవారం పోలవరంపై సావధాన తీర్మానంపై ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు పోలవరం విషయమై సభలో మాట్లాడారు.

‘‘పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, పునరావాస, పునఃనిర్మాణ పనుల కోసం తక్షణమే 16 వేల కోట్లు విడుదల చేయాలని రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌ను ఆయన సమర్థించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.