యాప్నగరం

ఏపీ, తెలంగాణ జల వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం

APex Council: ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం తారాస్థాయికి చేరుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదీ జలాల అంశంపై అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది.

Samayam Telugu 21 May 2020, 8:41 pm
కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య చోటు చేసుకున్న వివాదం ముదురుతున్న నేపథ్యంలో.. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం రంగంలోకి దిగింది. ఏపీ, తెలంగాణ జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అపెక్స్ కౌన్సిల్ అతి త్వరలో సమావేశం కానుంది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలు, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు గురువారం (మే 21) లేఖ రాసింది. ఈ కౌన్సిల్‌లో కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండనున్నారు.
Samayam Telugu ఏపీ, తెలంగాణ జల వివాదం
AP Telangana Water Row


పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 203పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో వివాదం మొదలైంది. కృష్ణా, గోదావరి జలాల అంశానికి సంబంధించి ఇరు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ అంశం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

అపెక్స్ కౌన్సిల్ సమావేశ అజెండా కోసం అంశాలను పంపాలని రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర జల్‌ శక్తి శాఖ కోరింది. ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఏసీ మల్లిక్ లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అంగీకారంతోనే అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Must Read: ఏమిటీ జల వివాదం? ఏపీ, తెలంగాణ ఏం వాదిస్తున్నాయి?

Also Read: విశాఖలో మళ్లీ తెల్లని పొగ.. మరోసారి తీవ్ర కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.