యాప్నగరం

వచ్చేది జనసేన ప్రభుత్వమే.. నాగబాబు అంచనా ఇదీ..

బీజేపీ, జనసేన కలిసి 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని జనసేన నాయకుడు నాగబాబు తెలిపారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు.

Samayam Telugu 31 Jan 2020, 1:14 am
రాష్ట్రాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ, జనసేన కలయిక చాలా ముఖ్యమని సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. 2024లో బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని జోస్యం చెప్పారు. గురువారం (జనవరి 30) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన నాగబాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఏది రద్దు చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని నాగబాబు చెప్పారు.
Samayam Telugu Naga-Babu


పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నాయని నాగబాబు విమర్శించారు. ఇక్కడి రోడ్ల మీద ప్రయాణం చేయడం కంటే హెలికాఫ్లర్లు కొనుక్కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. నాగబాబు 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జల్లా నర్సాపురం లోక్‌సభా స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన విషయం తెలిసిందే.

సినీ నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఇటీవలే బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. రాబోయే స్థానికల సంస్థల ఎన్నికల నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు బీజేపీతో పొత్తు కొనసాగుతుందని ఇరు పార్టీలు ప్రకటించాయి. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసి పని చేస్తాయని ప్రకటించాయి. తాజాగా, పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు సైతం 2024లో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.