యాప్నగరం

మనసు కలిచివేసింది.. ఊహించుకుంటేనే గుండె భారంగా.. పవన్ కళ్యాణ్

చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్‌ రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన తన మనసును కలిచివేసిందని పవన్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

Samayam Telugu 27 Mar 2022, 1:57 pm
చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్‌ రోడ్డు ప్రమాదం తన మనసును కలిచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. నిశ్చితార్థం వేడుకలకు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురై.. 8 మంది ప్రాణాలు కోల్పోవడం.. మరో 54 మంది గాయపడడం బాధించిందన్నారు. ప్రమాదం సంభవించిన చాలాసేపటి వరకు ఎవరూ గుర్తించలేదని తెలిసిందని.. ఆ సమయంలో క్షతగాత్రులు ఎంత నరకయాతన అనుభించారో ఊహించుకుంటేనే గుండె భారంగా మారుతోందన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి తగినంత నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందివ్వాలని కోరారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ ఘటన బాధకరమని.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మృతుల బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని ప్రధాని ప్రకటించారు.

కాగా చిత్తూరు ప్రమాద ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలను, సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. బాధితులు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.